రఘునాథపాలెం, ఏప్రిల్ 30: ఖమ్మం నగర పరిధిలోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ కొలువులకు మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బయోమెట్రిక్ పద్ధతిలో సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
పరీక్షల నిర్వహణ ఇన్చార్జిగా భద్రాద్రి ఎస్పీ జి.వినీత్ వ్యవహరించారు. పరీక్షలకు 12,143 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 11,985 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల పోలీస్శాఖ 144 సెక్షన్ విధించింది. కేంద్రాలను అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుభాశ్ చంద్రబోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ట్రైనీ ఐపీఎస్ అవినాశ్ కుమార్, ఏసీపీలు గణేశ్, రామోజీ రమేశ్, బస్వారెడ్డి, రెహమాన్, ప్రసన్నకుమార్ పర్యవేక్షించారు.