ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 21: జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఖమ్మం నగరంలోని రెజొనెన్స్ శ్రీనగర్ పాఠశాల కేంద్రంగా ఎనిమిది మంది న్యాయనిర్ణేతలు 187 ప్రాజెక్ట్లను ఆన్లైన్లో నలుగురు టెక్నీషియన్స్ సాయంతో మూల్యాంకనం చేశారు. జిల్లా నుంచి 10 ప్రాజెక్ట్లను రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపిక చేశారు. జూనియర్స్ విభాగంలో వరుసగా ఐదు స్థానాలు, సీనియర్స్ విభాగంలో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో నమూనాలను ప్రదర్శించనునున్నారు. మూల్యాంకన ప్రక్రియను డీఈవో సోమశేఖరశర్మ, డీఎస్వో జగదీశ్వర్ పర్యవేక్షించారు. రెండు రోజుల పాటు ఆతిథ్యం కల్పించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
1).శ్రీవల్లి- రెజొనెన్స్ స్కూల్, ఖమ్మం
2).మిత్ర- జడ్పీహెచ్ఎస్, వేంసూరు
3).ధీరజ్- త్రివేణి పాఠశాల, ఖమ్మం
4).డార్విన్ బాలాజీ- త్రివేణి పాఠశాల, ఖమ్మం
5).సుధీర్- భారత్ బాల మందిర్, ఖమ్మం
జూనియర్స్ విభాగంలో..
1).సాయిసింధూర- జడ్పీహెచ్ఎస్, ఏన్కూరు
2).హేమ- బ్లూమింగ్ మైండ్స్ స్కూల్, ఖమ్మం
3).నవదీప్- జడ్పీహెచ్ఎస్,
బురదరాఘవాపురం
4).సాత్విక- టీఎస్ఆర్జేసీ, వైరా
5).తమన్- మధు విద్యాలయం, వైరా