కొత్తగూడెం అర్బన్, జనవరి 24 : గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బుధవారం స్థానిక ప్రగతి మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఆమె అధికారులకు తగు సూచనలు చేశారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రగతి మైదానంలో జరగనున్న వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలన్నారు.
వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఉద్యాన అధికారి మరియన్న, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఆర్డీవో శిరీష, మున్సిపల్ కమిషనర్ రఘు తదితరులు పాల్గొన్నారు.