భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం టౌన్ : శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని అన్నారు. మ్యాన్పవర్ మేనేజ్మెంట్ విభాగానికి నోడల్ అధికారులుగా డీఈవో ఎం.వెంకటేశ్వరచారి, జిల్లా మైనార్టీ అధికారి కే.సంజీవరావు, కోఆర్డినేటర్ అధికారిగా డీవైఎస్ఈ(ఇరిగేషన్) కే.మహేశ్వరరావు వ్యవహరిస్తారని తెలిపారు. ట్రైనింగ్ మేనేజ్మెంట్ విభాగానికి నోడల్ అధికారులుగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ యూ.శ్రీనివాసరావు, డీఈవో కార్యాలయ ఏపీవో కే.కిరణ్కుమార్, కోఆర్డినేటర్ అధికారిగా డీఈవో కార్యాలయ ఏఎస్సీవో పి.సాయికృష్ణ, మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగానికి నోడల్ అధికారిగా జిల్లా భూగర్భ జలాల అధికారి మేఘావత్ బాలు, కోఆర్డినేటర్గా డీఏవో కొర్సా అభిమాన్యుడు వ్యవహరిస్తారని తెలిపారు. ట్రాన్స్పోర్టు మేనేజ్మెంట్ విభాగానికి నోడల్ అధికారులుగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జయపాల్రెడ్డి, ఆర్టీవో పి.వేణు, కోఆర్డినేటర్లుగా కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్లు వ్యవహరిస్తారు.
కంప్యూటరైజేషన్, ఐటీ విభాగం నోడల్ అధికారిగా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ సీహెచ్.సంపత్, డీఐవో ఎన్ఐసీ సుశీల్కుమార్, స్వీప్ విభాగం నోడల్ అధికారిగా సివిల్ సైప్లె డీఎం త్రినాథ్బాబు, డీఆర్డీవో జి.మధుసూదన్రాజు వ్యవహరిస్తారు. లా అండ్ ఆర్డర్ విభాగం నోడల్ అధికారిగా డీఎస్పీ డీసీఆర్బీ ఎన్.మల్లయ్యస్వామి, ఈవీఎం మేనేజ్మెంట్ విభాగం నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఎంసీసీ విభాగం నోడల్ అధికారిగా జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, కోఆర్డినేటర్ అధికారులుగా జడ్పీపీ సీఈవో ఎం.విద్యాలత, భద్రాచలం డీఎల్పీవో జి.పవన్ వ్యవహరిస్తారు. ఎక్స్పెండేచర్ మానిటరింగ్ విభాగం నోడల్ అధికారిగా జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ అధికారిగా జిల్లా ఆడిట్ విభాగం అధికారి జి.వెంకటేశ్వరరెడ్డి, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ విభాగం అధికారిగా జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండీ.అలీమ్, కోఆర్డినేటర్ అధికారిగా ఎస్ఎల్ఆర్పీ ఏడీ కుసుమకుమారి, తహసీల్దార్ అనంత రామకృష్ణ వ్యవహరిస్తారు. మీడియా, మీడియా కైంప్లెంట్స్ విభాగం అధికారిగా డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, కమ్యూనికేషన్ ప్లాన్ విభాగం అధికారిగా జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి బి.రవీందర్, కోఆర్డినేటర్ అధికారులుగా జిల్లా వెటర్నరీ అధికారి బి.పూర్ణచందర్, జిల్లా హార్టికల్చర్ అధికారి జే.మరియన్న వ్యవహరిస్తారు. ఎలక్ట్రోరల్ రోల్స్ విభాగం నోడల్ అధికారిగా కొత్తగూడెం డీఎల్పీవో రాజీవ్కుమార్, కోఆర్డినేటర్ అధికారిగా కొత్తగూడెం డీపీవో లక్ష్మీరమాకాంత్, ఫిర్యాదులు, ఓటర్ల హెల్ప్లైన్ విభాగం నోడల్ అధికారిగా జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామరెడ్డి, నోడల్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్ విభాగం నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.