మణుగూరుటౌన్, మార్చి 22 : బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శ్రామిక శక్తితోపాటు యాంత్రికశక్తి ఎంతో అవసరమని సింగరేణి సంస్థ డైరెక్టర్(పీఅండ్పీ) జి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు పీకేఓసీ-2 గనిలో రూ.4.5కోట్ల విలువైన 6.4 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంగల అత్యాధునిక వీల్లోడర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక యంత్రాలను వినియోగించుకుంటూ మణుగూరు ఏరియాకు నిర్దేశించిన 119.5 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఓసీ-2 గని కార్మికులు, అధికారులు, యూనియన్ల నాయకులు, కాంట్రాక్టు కార్మికులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రామచందర్, ఏరియా ఇంజినీర్ నర్సిరెడ్డి, ప్రాజెక్టు అధికారి(పీకేఓసీ-2) లక్ష్మీపతిగౌడ్, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, ప్రాజెక్టు ఇంజినీర్ వీరభద్రుడు, అధికారులు రమణారెడ్డి, లింగబాబు, అబ్దుల్షబ్బీరుద్దీన్, చిట్టా శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు వై.రాంగోపాల్, కృష్ణంరాజు, కార్మికులు పాల్గొన్నారు.