శ్రీరాంపూర్, జూలై 6 : సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకోవాలని, మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్షా సమావేశంలో ఆయన సమగ్రంగా చర్చించారు. మొదటి దశ లో 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించగా.. వీటిలో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సో లార్ సహా మొత్తం 224 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. మిగిలిన 76 మెగావాట్లను ఈ ఏడాది నవంబర్లోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో చేపట్టనున్న 11 మెగావాట్లు, కొత్తగూడెంలో చేపట్టనున్న 10.5 మెగావాట్ల ప్లాంట్లను ఈ సెప్టెంబర్లోగా పూర్తి చే యాలని ఆదేశించారు. రామగుండం ఓసీ-1 ఓవర్ బ ర్డెన్ డంప్పై చేపట్టే 22 మెగావాట్ల ప్లాంట్ను అక్టోబర్లోగా, కొత్తగూడెంలో చేపట్టే 22.5 మెగావాట్ల ప్లాంట్ను నవంబర్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్టీపీపీ జలాశయంలో చేపట్టనున్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సో లార్లో ఇప్పటికే 5 మెగావాట్లు పూర్తి కాగా, మిగిలిన 10 మెగావాట్లను ఈ డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
2024-25 నాటికి సింగరేణి సంస్థ తన సంస్థాగత ఇంధన అవసరాలను సోలార్ విద్యుత్ ద్వారా తీర్చుకోవడం ద్వారా నెట్ జీరో కంపెనీగా మారేందుకు వీలుగా రెండో దశలో 240 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూ ర్తి చేసి వచ్చే ఏడాదిలోగా ప్లాంట్లను అందుబాటులోకి తీ సుకురావాలన్నారు. వీటిలో సత్తుపల్లి వద్ద 35 మెగావా ట్ల ప్లాంట్లు, శ్రీరాంపూర్ ఐకే చెన్నూర్ వద్ద 27.5 మెగావాట్ల ప్లాంట్, మందమర్రి ప్రాంతంలో పలు గనులు, కా లనీల వద్ద అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో 65 మె గావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్ర తిపాదించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అం దుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో 37.5 మెగావాట్ల సో లార్ ప్లాంట్, రామగుండం-3 ఏరియాలో 41 మెగావా ట్ల సామర్థ్యం కోసం రెండు చోట్ల ప్లాంట్లు నిర్మించాలని, భూపాలపల్లిలో 12 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-1 ఏరియాలో పాత పవర్ హౌస్ స్థలంలో 5 మెగావాట్ల ప్లాంట్, ఇల్లందులో ప్రస్తుతం ఉన్న సోలార్ ప్లాంట్కు పకనున్న ఖాళీ ప్రదేశంలో 15 మెగావాట్ల ప్లాంట్ను నిర్మించనున్నామని తెలిపారు.
ఎస్టీపీపీని నంబర్-1లో నిలపాలి
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గత ఏడాది మాదిరిగా నే ఈ ఏడాది కూడా అత్యద్భుత పనితీరుతో దేశంలో నం బర్-1 స్థానంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. ఎస్టీపీపీలోని మొ దటి యూనిట్కు సంబంధించి క్యాపిటల్ ఓవర్ హాలింగ్ (అన్ని యంత్రాల సమగ్ర పరిశీలన)ను చేపట్టామని, సా ధారణంగా క్యాపిట్ ఓవర్ హాలింగ్కు 45 రోజుల స మయం పడుతుందని.. కానీ 35 రోజుల్లేనే ఈ ప్రక్రియ ను పూర్తి చేసి యూనిట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. దీనిపై సీఎండీ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సీటీసీ సంజయ్ కుమార్ సుర్, జీఎం(ఎస్టీపీపీ) డీవీఎస్ఎస్ఎన్ రాజు, జీఎం(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకే విశ్వనాథ రాజు, ఏజీఎం(సివిల్) కేఎస్ఎన్ ప్రసాద్, ఏజీఎం (ఫైనాన్స్) సుధాకర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఓ అండ్ ఎం జేఎన్ సింగ్, జీఎం(సివిల్) టీ సూర్యనారాయణ పాల్గొన్నారు.