ఖమ్మం, నవంబర్ 2: ఈ నెల 5న ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభను ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం ఇక్కడికి చేరుకొని సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా సభా ఏర్పట్లను పరిశీలించారు.
నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్, పారింగ్, స్టేజీ, వివిధ గ్యాలరీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అదికారులను కోరారు. డీసీసీబీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, కొండబాల కొటేశ్వరరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.