వైరా టౌన్, జనవరి 23 : వైద్య రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఏన్కూరు రైతువేదికలో సోమవారం ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. ప్రాజెక్ట్లు నిర్మించి తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా చేయాలని సీఎం ధృడ సంకల్పంతో ఆకుపచ్చని పాడి పంటల తెలంగాణలా చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ రైతుభీమా, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.