ఖమ్మం, డిసెంబర్ 31: ఖమ్మం నగరంలోని ఖిల్లాబజారుకు చెందిన మహ్మద్ అబ్దుల్మాలిక్ కుమారుడు మహ్మద్ ఖుద్దూస్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడి తండ్రి వైద్యానికయ్యే ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియజేయడంతో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎల్వోసీను విడుదల చేయించారు. మంత్రి ఆదివారం ఆ చెక్కును ఆయన కార్యాలయంలో బాధితుడి తండ్రికి అందించారు.