సారపాక/ భద్రాచలం, ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం బీజేపీ తలపెట్టిన సంకల్పయాత్ర సభకు హాజరయ్యేందుకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి విచ్చేశారు. తొలుత బూర్గంపహాడ్ మండలం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకోగా ఆయనకు భద్రతా దళాలు స్వాగతం పలికి గౌరవ వందనం చేశాయి.
అనంతరం సీఎం ఐటీసీ గెస్ట్ హౌస్కు పయనమయ్యారు. తర్వాత భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్ర్తాలు అందజేశారు.