ఖమ్మం రూరల్, ఆగస్టు 4: విలీన పంచాయతీల్లోని శివారు కాలనీలన్నింటిలోనూ సీసీ రోడ్లు నిర్మిస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని పెద్దతండా పంచాయతీలో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత లక్ష్మీబృందావనం అపార్ట్మెంట్ సమీపంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. అదే కాలనీలో రూ.9 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అక్కడి నుంచి బయలుదేరి సాయిగణేశ్ నగర్లో రూ.9 లక్షలు, టీఎన్జీవోస్ కాలనీలో రూ.10 లక్షలు, సాయినగర్ కాలనీలో మరో రూ.9 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల పనులకు శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేఎంసీలో విలీనమై ఇప్పుడు డీలిమిటేషన్ అయిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే కామంచికల్ ప్రధాన రహదారి, రైల్వే బ్రిడ్జి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మున్నేరువాగుపై సైతం మరో బ్రిడ్జిని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు బెల్లం ఉమ, వై.వరప్రసాద్, బెల్లం వేణు, గూడ సంజీవరెడ్డి, అక్కినపల్లి వెంకన్న, ముత్యం కృష్ణారావు, ఆంజనేయులు, మేకల ఉదయ్, రవి, మానుకొండ శ్రీను, మైబెల్లిసాహెబ్, అశోక్కుమార్, సుమ, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.