ఖమ్మం, జనవరి 22 : రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కే.చందన్కుమార్ అన్నారు. సోమవారం సమీకృత కార్యాలయంలో జిల్లాలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ మండల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 73 శాతం మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, మిగిలిన 27 శాతం మంది కూడా పూర్తి చేసుకునే విధంగా రేషన్ డీలర్లు చొరవ చూపాలన్నారు.
ప్రతి డీలర్ మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి నాణ్యమైన సరుకులు తీసుకెళ్లి కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.