ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 78 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ-ఆర్జేసీ విద్యాసంస్ధల అధినేత గుండాల కృష్ణ తెలిపారు. గురువారం కళాశాలలో అడ్డోడే సోల్యుషన్స్ సంస్ధ వివిధ దశలలో ప్లేస్ మెంట్స్ నిర్వహించింది. ఎస్బీఐటీ కళాశాల ఎంబీఏ నుంచి 63మంది, ఆర్జేసీ కళాశాల నుంచి 62మంది మొత్తం 125మంది హజరుకాగా నియామక ప్రక్రియలో ప్రతిభ కనబర్చి 78 మంది ఎంపికైయ్యారు.
వీరిలో ఎస్బీఐటికి చెందిన వారు 47మంది, ఆర్జేసీ చెందిన వారు 31మంది ఉన్నారని వివరించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ గంథం శ్రీనివాసరావు, అకాడమిక్ డైరక్టర్స్ సత్యనారాయణ, కృష్ణకాంత్, శివప్రసాద్, సి శ్రీనివాసశర్మ, ప్రవీణ్కుమార్, తదితరులు అభినందించారు.