బూర్గంపహాడ్, మార్చి 24 : బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ నాయకత్వంపై నమ్మకంతో ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్.ప్రవీణ్కుమార్తోపాటు మాజీ ఎంపీ కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బా ల్కసుమన్ల సమక్షంలో జిల్లాలోని బీఎస్పీ ముఖ్యనేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ. రమణ, మాజీ జిల్లా సలహాదారు గాడిద దామోదర్, మాజీ జిల్లా ఇన్చార్జ్ నల్లగట్ల రఘు, మాజీ జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి ఆధ్వర్యంలో జిల్లాలోని 52 మంది ముఖ్యనేతలతో కలిసి బీఆర్ఎస్లో చేరినట్లు రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల యుద్ధం లో భారత రాష్ట్రసమితి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచన మేరకు త్వరలో జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులను కలిసి సూచనలు, సలహాల మేరకు బీఆర్ఎస్ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో పొడుతూరి రమాదేవి, పూనెం నరేష్, కనుకు సాగర్, చిప్పలపల్లి శ్రీనివాసరావు, సోడె వీరాస్వామి, భాగవతపు సతీష్, ఇసంపల్లి శివకుమార్, శేషు, సోందె వెంకటరాజు, పొడుతూరి రవీంద్రప్రసాద్, గోడేటి వెంకటేశ్వర్లు, నారపోగు రవికిరణ్, నాగేశ్వరరావు, ప్రసాదరావు ఉన్నారు.