తిరుమలాయపాలెం, మే 25 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మండలంలోని పిండిప్రోలులో శనివారం ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నిరుద్యోగుల గొంతుక అసెంబ్లీలో వినిపించేందుకు విద్యావంతుడైన రాకేశ్రెడ్డికి ఓట్లువేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ వైస్చైర్మన్ చామకూరి రాజు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పరికపల్లి చంద్రశేఖర్, నాయకులు పసలాది ముత్తయ్య, దూదిమెట్ల శ్రీను, చామకూరి కిరణ్, వెంకట్, పులుగుజ్జు మహేశ్, సురేశ్ పాల్గొన్నారు.
పెనుబల్లి, మే 25: ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు. మండలంలోని వీఎం బంజరలో శనివారం పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి అవినీతిపరుడు బ్లాక్మెయిలర్ తీన్మార్ మల్లన్న అని, నిజాయితీ పరుడు రాకేష్రెడ్డికి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, పెనుబల్లి మాజీ సర్పంచ్ తేజావత్ తావునాయక్, మరీదు చంద్రశేఖర్, పండు, చావలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, మే 25: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం కల్లూరు, శాంతినగర్, మధిరరోడ్డు, ఏకలవ్య కాలనీ, సోమలింగారెడ్డిబజార్, కప్పలబంధం రోడ్డులో శనివారం బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల ప్రసాద్, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ కమిలీ, సోషల్ మీడియా ఇన్చార్జి శీలంశెట్టి కిరణ్కుమార్, మైనార్టీ నాయకులు సయ్యద్ రవూఫ్, ఇషాక్, అజ్మీరా జమలయ్య, కంభంపాటి బాబురావు, రాచబండ్ల నాగేశ్వరరావు, కంభంపాటి పుల్లారావు, కొత్తపల్లి ఏసు, నల్లగట్ల మారయ్య పాల్గొన్నారు.
వైరారూరల్, మే 25: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మండలంలోని కేజీ సిరిపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కామినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పరుచూరి రామారావు, ఐనాల కనకరత్నం, మట్టూరి సత్యనారాయణ, నారపోగు అయోధ్య, పుచ్చకాయల బాబు తదితరులు పాల్గొన్నారు.