ఖమ్మం: దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను స్మరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంత్రి పువ్వాడ అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సమసమాజ స్వాప్నికుడు, భారత రత్న అంబేద్కర్ గొప్ప మహానీయుడని కొనియాడారు.
భావితరాలకు ఆ మహోన్నత వ్యక్తి నెలకొల్పిన విలువల్ని అందించాలన్నారు. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసి, నేడు వెనుకబడిన, బలహీన వర్గాలు స్వయం సమృద్ది దిశగా రాణఫించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లనే సాధ్యమయిందన్నారు.