సత్తుపల్లి టౌన్, తల్లాడ, జనవరి 19 : అంధత్వరహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని అంబేద్కర్నగర్ కమ్యూనిటీ హాల్లో, తల్లాడ మండలం పాతపినపాక రైతువేదికలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖమ్మం సభలో మాట్లాడుతూ తన రాష్ట్రంలో కూడా కంటివెలుగు ప్రారంభిస్తానని చెప్పడం గొప్పవిషయమన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సీతారామ్, కమిషనర్ సుజాత, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పాతపినపాక రైతువేదికలో సర్పంచ్ స్వరాజ్యం ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు కంటి వెలుగు కేంద్రాన్ని పర్యవేక్షించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వైరాటౌన్, జనవరి19 : అంధత్వ రహిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. రైతువేదిక వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
కారేపల్లి, జనవరి 19 : కంటి వెలుగు పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. అప్పాయిగూడెం రైతువేదిక వద్ద కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభినందించడం ఇక్కడ అభివృద్ధికి నిదర్శనమన్నారు. అనంతరం రైతు వేదికలో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. . కల్లూరు, జనవరి 19 : నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే సీఎం కేసీఆర్ రెండవ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు అన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేరువంచలో సర్పంచ్ పాలెపు లక్ష్మీకాంతమ్మ ప్రారంభించారు.
సత్తుపల్లి రూరల్, జనవరి 19 : గంగారం రైతువేదిక, బుగ్గపాడు పంచాయతీ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమాలను ఎంపీపీ దొడ్డా హైమావతి ప్రారంభించారు.
పెనుబల్లి, జనవరి 19 : బయ్యన్నగూడెం, రామచంద్రరావుబంజరు గ్రామాల్లో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, మండల ప్రత్యేకాధికారి నాగరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేంసూరు, జనవరి 18 : వేంసూరు, రాయుడుపాలెం, భీమవరం గ్రామపంచాయతీల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత ప్రారంభించారు. వేంసూరులో136 మందిని పరీక్షించి 25 మందికి కళ్లజోళ్లు, రాయుడుపాలెంలో 103 మందిని పరీక్షించి 42, భీమవరంలో 101 మందిని పరీక్షించి 25 మందికి కళ్లజోళ్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైరారూరల్, జనవరి19 : కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. తాటిపూడి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కోటిరత్నం, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కామేపల్లి,జనవరి 19 : కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ముచ్చర్లలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేస్తామన్నారు.
కొణిజర్ల, జనవరి19 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ పోట్ల కవిత అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దగోపతి, కొణిజర్ల పీహెచ్సీల పరిధిలోని కంటి వెలుగు శిబిరాలను ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, సర్పంచ్లు సూరంపల్లి రామారావు, చల్లా మోహన్రావు ప్రారంభించారు. ఈ శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటిఅద్దాలు, మందులు అందజేశారు.