లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 17 : హైదరాబాద్లోని ఫారెస్టు అకాడమీ దూలాపల్లిలో రెండు రోజులుగా 6వ స్టేట్ ఫారెస్టు స్పోర్ట్స్మీట్ క్రీడలు జరిగాయి. భద్రాద్రి జోన్లోని వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఫారెస్టు అధికారులు పురుషులు, మహిళల విభాగం వేర్వేరుగా అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొన్నారు. ప్రతి మ్యాచ్లో హోరాహోరీగా తలపడి ఓవరాల్ చాంపియన్గా భద్రాద్రి జోన్ రెండో స్థానంలో నిలిచింది.
భద్రాద్రి జోన్ తరఫున క్రీడాకారులు పసుపురంగు టీషర్ట్స్ను ధరించారు. మార్చ్ఫాస్ట్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. కబడ్డీలో పురుషులు, మహిళల విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. క్రికెట్, వాలీబాల్లో రెండో బహుమతిని గెలుచుకున్నారు. లాంగ్జంప్, హైజంప్, రన్నింగ్, షాట్ఫుట్, జావెలిన్ త్రో, వెయిట్ లిఫ్టింగ్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నీస్, షటిల్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో జోన్ క్రీడాకారులు నిలిచారు.
బీట్ ఆఫీసర్ నుంచి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు క్రీడల్లో పాల్గొని బహుమతులు సాధించారు. భద్రాద్రి జోన్ ఓవరాల్ చాంపియన్షిప్లో రెండో స్థానాన్ని గెలుచుకున్నారు. భద్రాద్రి జోన్ సీసీఎఫ్ భీమానాయక్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్బీవోలు దామోదర్రెడ్డి, తిరుమలరావు, నాగభూషణం, మంజుల, రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.