కొత్తగూడెం సింగరేణి, ఏప్రిల్ 29 : సింగరేణి సంస్థ పర్యావరణహిత చర్యగా 224 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను అతితక్కువ సేమయంలో నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని కూడా ప్రారంభించినందుకు జాతీయస్థాయిలో మరో అవార్డును సాధించింది. సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రతి ఏడాది ప్రకటించే రెనివ్ ఎక్స్ అవార్డుల్లో భాగంగా ఈ సారి సింగరేణి సంస్థకు ఉతక్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇయర్ అవార్డు 2023 ప్రకటించారు.
శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో సొసైటీ డైరెక్టర్ జనరల్, రాష్ట్ర ఇంధనశాఖ మాజీ స్పెషల్ సెక్రటరీ అజయ్మిశ్రా ఈ అవార్డును సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావుకు అందజేశారు. సింగరేణివ్యాప్తంగా సోలార్ థర్మల్ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్లాంట్లను విజయవంతంగా నిర్వహిస్తూ విద్యుత్ను సమర్థంగా అనుసంధానం చేస్తున్నందుకు సింగరేణి సంస్థను నిర్వాహకులు ప్రత్యేకించి ప్రశంసించారు. సింగరేణివ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన తొమ్మిది ప్లాంట్ల నుంచి 615 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్టు నుంచి కొనుగోలు చేస్తున్న థర్మల్ విద్యుత్ వినియోగాన్ని ఆ మేరకు తగ్గించగలిగిందన్నారు.
ఈ నేపథ్యంలో 2023వ సంవత్సరానికి అత్యుత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు లభించడం సంస్థ థర్మల్, సోలార్ దిశగా చేస్తున్న కృషికి గుర్తింపుగా కంపెనీ భావిస్తోంది. ఇదిలాఉంటే న్యూ ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రముఖ ఎనర్జీ మిషన్ సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో జాతీయస్థాయి అవార్డు లభించింది. అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్న దేశవ్యాప్త థర్మల్ విద్యుత్ కేంద్రాల విభాగంలో అత్యుత్తమ కే్రందంగా గుర్తిస్తూ ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ ప్లాంట్ అవార్డును నిర్వాహకులు బహుకరించారు. ఈ అవార్డు రావడం ఇది మూడోసారి. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.