ఎర్రుపాలెం: పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు కొత్త బట్టలతో వారి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్ధేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడం పట్ల సీఎం కేసీఆర్కు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మాజీ ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు పంబి సాంబశివరావు, శీలం వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి త్రివేణి, శీలం ఉమామహేశ్వరి, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్వలి, డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.