ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయమే మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజులు ఆచరించారు. జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు పండుగ విశిష్టత గురించి చెప్పే విషయాలను శ్రద్ధగా విన్నారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్తోపాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
-నమస్తే నెట్వర్క్