కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పాలియేటీవ్ కేర్ యూనిట్, వైరాలజీ ల్యాబ్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వయో భారంతో పాటు ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కనీసం వారి పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారన్నారు.
పక్షవాతం, క్యాన్సర్, మంచం మీద దీన స్థితిలో ఉన్న వ్యక్తులకు మనోధైర్యాన్నిచ్చేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటీవ్ కేర్ యూనిట్ కొండంత ధైర్యమన్నారు. చికిత్సలకు లొంగని వ్యాధులతో బాధపడుతున్న వారికి ధైర్యాన్ని కల్పించి అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, వైద్యాధికారులు సరళ, పోటు వినోద్, పాలియేటీవ్ కేంద్రం ఇంచార్జి డాక్టర్ ప్రసాద్, కౌనర్సిలర్ రుక్మాంగధర్ బండారి, కమిషనర్ అరిగెల సంపత్కుమార్, తహసీల్దార్ రామకృష్ణలు పాల్గొన్నారు.