పాల్వంచ: తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ వజీర్, సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్రిశ రాధాకృష్ణల ఆధ్వర్యంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరావును, ట్రాన్స్కో ఎండీలను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆర్టీజన్ కార్మికుల సమస్యలపై చర్చించి వినతి పత్రాన్ని అందించారు. జీవోనంబర్ 6 ప్రకారం ఏదైతే సెకండ్ డిపెండెంట్ ఉందో దానిమీద, తరువాత డిపెండెంట్ ఉద్యోగాలపై, తరువాత ఆర్టీజన్లకు రావాల్సిన కారుణ్య నియామకాలపై డిపెండెంట్ ఉద్యోగాలపై , బదిలీలు, ఇతర అంశాలపై మాట్లాడారు.
వీటికి సీఎండీ స్పందించారని, వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన మీటింగ్ను ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పటి వరకు ఓపికగా ఉండాలని, జనవరి 4 తరువాత డైరెక్టర్ హెచ్ఆర్ విధులకు జాయిన్ అవుతారని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెన్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, అబ్దుల్ తఖీ, నర్సింగరావు, రీజినల్ కార్యదర్శి ధనయ్య, రఘునాథరెడ్డిలు పాల్గొన్నారు.