దమ్మపేట, జులై 01 : దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు తన జన్మదినాన్ని పురస్కరించుకుని కొడుకు తాటి రవికుమార్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సాయిబాబాను వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.