అన్నపురెడ్డిపల్లి:మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రధాన పురోహితుడు ప్రసాదాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం జరిపించారు. భక్తులు ఆలయంలో పూజలు చేసి, కల్యాణం తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.