బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : ఐసీడీఎస్ మాసోత్సవాల్లో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ బానోతు నర్సింహ మాట్లాడుతూ గర్భిణులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ స్వరాజ్యం, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం, ఆశాలు, గర్భిణులు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.