భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ భక్తుడు వితరణ అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కస్తూరి సుబ్రహ్మణ్య శర్మ రూ. 1లక్ష అందించారు. సంబంధిత చెక్కును దేవస్థానం ఈఓకు అందజేశారు. బుధవారం రామయ్యను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం సుబ్రహ్మణ్యశర్మ దేవస్థానం ఈఓ బానోత్ శివాజీకి అన్నదాన పథకానికి రూ. 1లక్ష చెక్కును అందించారు.