దమ్మపేట :వెయ్యి కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట తహాసీల్దార్ రంగా ప్రసాద్కు గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తునట్లు వివరించారు. తెలంగాణాలో మున్నూరు కాపు కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి వున్నారన్నారు.
మున్నూరు కాపుల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు మేకల రమేష్, చిన్నశెట్టి సత్యనారాయణ, పగడాల రాంబాబు, చినబాబు, చెవ్వా వెంకట్, యుగంధర్, వెంకటేశ్వరరావు, ముక్తేశ్వరరావు, ప్రసాద్, మధు, తోట సత్యనారాయణలు పాల్గొన్నారు.