చండ్రుగొండ: అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమ్మర్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం గోదావరిలోయ ప్రాంతంలో వందలాది మంది బిడ్డలు అమరులయ్యారన్నారు. వారి ఆశయసాధనకు మనమంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ నాయకులు వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.