దమ్మపేట: ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమను సన్మానించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు.గండుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్నారు. నూతనంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన కొత్తూరు ఉమకు తుమ్మల శాలువా కప్పి సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
తుమ్మలను కలిసిన వారిలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావుతో పాటు సత్తుపల్లి, అన్నపురెడ్డిపల్లికి చెందిన నాయకులు గాదె సత్యం, వనమా వాసు, మల్లూరు అంకమరాజు, వేముల సుధాకర్ తదితరులు ఉన్నారు.