భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లా బీజేపీలో ముసలం పుట్టింది. ఆడియో లీకుల ద్వారా నాయకుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రస్తుత అ ధ్యక్షుడు కోనేరు సత్యనారాయణపై ఆ పార్టీ భద్రాచల నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి చర్లకు చెందిన ఓ కార్యకర్తతో జరిపిన ఫోన్ సంభాషణ ప్రస్తు తం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ‘ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. పార్టీ అధిష్ఠానం వరద బాధితులకు అధిష్ఠానం నిత్యావసరాలు పంపిస్తే వాటిలో సగం కూడా బాధితులకు చేరలేదు. భద్రాచలం నియోజకవర్గంలో నాకు తెలియకుండానే సమావేశాలు పెడుతున్నారు. వారు తాగుబోతు లు. జూదగాళ్లు.’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.