భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆస్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కేఈ స్థలశాయిని ఘనంగా సత్కరించారు. దేవస్థానం అర్చక స్వాములు, వైదిక పెద్దలు చిత్రకూట మండపంలో ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆగమ సలహా మండలి సభ్యులుగా కేఈ స్థలశాయిని నియమించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ఆగమ సలహా మండలిలో స్థానం కల్పించినందుకు ఆయనను దేవస్థానం అర్చకులు, వేద పండితులు పట్టువస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకులు సీతారామా నుజాచార్యులు, విశ్రాంత అర్చకులు అమరవాది సీతారామానుజాచార్యులు, అమరవాది రామానుజాచార్యులు, సౌమిత్రి శ్రీనివాసాచార్యులు, వేద పండితులు లింగాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.