నమస్తే నెట్వర్క్ : దీపాల వెలుగులు నింగిని తాకాయి. చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా దీపావళి సంబురాలు పటాకుల మోతతో అంబరాన్నంటాయి. లక్ష్మీపూజ చేసుకున్న భక్తులు కుటుంబాల సమేతంగా పండుగను ఆనందంగా చేసుకున్నారు.
ఇళ్ల ముంగిళ్లను బంతిపూలు, ముగ్గులతో అలంకరించారు. మట్టి ప్రమిదలను వరుసగా పెట్టి ఒత్తులతో దీపాలు వెలిగించారు. పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చి సంబురాల్లో మునిగితేలారు. కుటుంబ సమేతంగా నూతన వస్ర్తాలు ధరించి భక్తిశ్రద్ధలతో నోములు, లక్ష్మీ పూజలు చేశారు. పూజారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.