భద్రాచలం: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్లమ్మ అందించిన 30 పాశురాలను చదివి వాటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించారు అర్చకులు. తెల్లవారుజామునే అమ్మవారికి మేలుకొలుపు చేసి, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.