అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ.. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ను ఏర్పాటు చేస్తున్నామని,ఈ నెల చివరి నాటికి బ్యాంక్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం రైతుల కోసం అనేక సేవలను డీసీసీబీ బ్యాంక్ల ద్వారా అందిస్తుందన్నారు. రైతుల ఆర్ధికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ సీఈవో వీరబాబు, సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు, నాయకులు మాధవరెడ్డి, వెంకటేశ్వరరావు, ఉమా, భారత రాంబాబు, చల్లా రాంబాబు పాల్గొన్నారు.