భద్రాచలం:వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సమన్వయకర్తగా భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీనివాస్ను నియమించినట్లు అంతర్జాతీయ వాసవీ క్లబ్స్ సమాఖ్య అధ్యక్షులు పాట సుదర్శన్, డిస్ట్రిక్ట్ వాసవీ గవర్నర్ యర్రం సుజాత తెలిపారు. ఈ సందర్భంగా చారుగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 25ఏళ్లుగా వాసవీ క్లబ్ అధ్యక్షునిగా, జోన్ ఛైర్మన్గా, డిప్యూటీ గవర్నర్గా, క్యాబినెట్ సెక్రటరీగా, జిల్లా సమన్వయకర్తగా అవకాశం ఇచ్చిన మాజీ అంతర్జాతీయ అధ్యక్షులకు, మాజీ గవర్నర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ సమన్వయకర్తగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, ప్రజలకు తన వంతుగా సేవలు అందిస్తానని, తనకు సంపూర్ణ సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ను పట్టణ ప్రముఖులు డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, యశోద రాంబాబు, నగేష్, కంభంపాటి సురేష్, కురిచేటి రాము, శ్రీనివాస్, చింతల వినోద్కుమార్, బీవీ కృష్ణార్జునరావు, తోకల నాగేశ్వరరావు, చారుగుండ్ల రామకృష్ణ, రేపాక రామారావు గుప్తా, అమర్, శంకర్, సాగర్, సాయిచంద్లతో పాటు పలువురు మాజీ అధ్యక్షులు, జోన్ ఛైర్మన్లు, డిప్యూటీ గవర్నర్లు అభినందించారు.