రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రఘునాథపాలెం రైతు వేదికలో “ఆజాద్ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ఆమె అవగాహన కల్పించారు.
ఖమ్మం డివిజన్ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోతు ప్రియాంక, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చైతన్య, నాగరాజు, మండల వ్యవసాయాధికారి ఇంటూరి భాస్కర్రావు, రైతులు పాల్గొన్నారు.