ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాణ్యతతో భవననిర్మాణాలు జరగాలంటే ఎటువంటి ముడిపదార్ధాలను ఉపయోగించాలనే అంశంపై సివిల్ విద్యార్థులకు అవగాహన కలిగించారని కళాశాల చైర్మన్ జి. కృష్ణ తెలిపారు.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ,నాణ్యత పెరగటానికి, నిర్మాణ ఖర్చు తగ్గటానికి కొత్త నిర్మాణ పద్దతులు అవసరం అని విద్యార్థులకు వివరించారు. ఈ సదస్సులో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, మై హోం సంస్ధ ప్రతినిధులు మోరే, వాసుదేవన్, అధ్యాపకులు పాల్గొన్నారు.