మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ కే.నాగజ్యోతి, డాక్టర్ జీ.వేణుగోపాల్ సేంద్రియ పద్ధతి విత్తనం ఎంపిక, సాగు విధానం, బీజామృతం, జీవామృతం, గణజీవామృతం, అమృతద్రావణం, జీవన ఎరువుల తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సురేందర్రెడ్డి, దేశవాళీ గోసంరక్షకుడు మురళీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.