ఖమ్మం : కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..నేలకొండపల్లి మండలం అజయ్ తండా నుంచి రాజేశ్వరపురంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటోలో మొత్తం పది మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.