ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి నేషనల్ మైనారిటీస్ పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలలో ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరకాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
మైనారిటీ విద్యార్ధులు ఉపకార వేతనాలు నూతనంగా దరఖాస్తులు చేసుకునేందుకు, ఇప్పటికే ఉపకార వేతనాలు పొందుతున్న వారు రెన్యువల్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్ధులు, కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్ వెబ్ సైట్ https://Sholarship.gov.in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు షెడ్యూల్ ప్రకారం సమర్పించాలని కోరారు.