ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 1, 2వ విడతలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. 3వ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీవరకు అవకాశం ఉందని సూచించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు www.iti.telangana.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.