ఖమ్మం, ఫిబ్రవరి 9 : నయా ఆర్థిక విధానాల సృష్టికర్త, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించడం పట్ల పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన పరిపాలన, ఆర్థిక సంసరణలతో దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల యావత్ తెలంగాణ సమాజం గర్విస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేసీఆర్ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ సరార్ పీవీకి సుముచిత స్థానం కల్పించి వర్ధంతి, జయంతితోపాటు ఏడాదిపాటు పీవీ శత జయంతోత్సవాలు నిర్వహించిందని తెలిపారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంసరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెకించిన గొప్ప నాయకుడని మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బ్రాహ్మణ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, మామునూరు మురళీధర్రావు, హైకోర్టు న్యాయవాది ఈశ్వర ప్రగడ హరిబాబు, బ్రాహ్మణ సంఘం నాయకులు వనం కృష్ణవేణి, బ్రాహ్మణ సంక్షేమ సంఘ సమాఖ్య నాయకులు సూరవజ్జుల వాసు, తాటికొండాల సీతారామ శాస్త్రి, మాటూరి లక్ష్మీనారాయణ, సర్వసతీభట్ల శ్రీధర్, ఆమంచి సురేశ్ తదితరులు ఉన్నారు.
పీవీ నర్సింహారావుకు ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు శుక్రవారం వేరు వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.