కల్లూరు, నవంబర్ 16: కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధిలో చేశానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరులో బుధవారం రైతుబంధు సమితి సభ్యుడు లక్కినేని రఘు అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. ఏ ప్రభుత్వమూ సాధించని అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందన్నారు. రూ.10 కోట్లతో కల్లూరు ప్రభుత్వాసుపత్రి నిర్మించామన్నారు. 50 పడకల వైద్యశాలగా అప్గ్రేడ్ చేయిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీర్చామన్నారు. మినీ స్టేడియం పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ నూతన కార్యాలయాన్ని సత్తుపల్లిలో నిర్మించాల్సి ఉండగా కల్లూరులోనే నిర్మిస్తున్నామన్నారు.
త్వరలో మ్యాంగో మార్కెట్ నుంచి ఎన్నెస్పీ క్రాస్రోడ్ వరకు రూ.200 కోట్లతో డివైడర్, సెంట్రల్ లైటింగ్తోపాటు రోడ్డు విస్తరణ పనులను చేపడతామన్నారు. బోడిమెళ్లతోపాటు ఇతర గ్రామాల్లో రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎంపీపీ బీరవల్లి రఘు, పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి సభ్యుడు పసుమర్తి చందర్రావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, నాయకులు పెడకంటి రామకృష్ణ, సయ్యద్ హిమామ్, సయ్యద్ అలీ, యాకూబ్అలీ, కమ్లీ, రవూఫ్, మురళి, రాంబాబు, న ర్సింహారావు, రామకృష్ణ, దుర్గారావు, పెంటయ్య, రా మారావు, శ్రీనివాసరావు, రాము, కొరకొప్పు ప్రసాద్, కంభంపాటి వెంకటేశ్వర్లు, ఉబ్బన వెంకటరత్నం, రాచమళ్ల నాగేశ్వరరావు, ఉబ్బన పుల్లారావు పాల్గొన్నారు.
ఎంపీలకు ఘన స్వాగతం పలకాలి..
సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో శుక్రవారం జరిగే ఆత్మీయ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర హాజరవుతున్నారని, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీగా వచ్చి వారికి కల్లూరులో ఘన స్వాగతం పలకాలని నాయకులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. ర్యాలీతో పాటు సత్తుపల్లి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలి
వేంసూరు, నవంబర్ 16: సత్తుపల్లి జేవీఆర్ కాలేజీలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. మండలంలోని మర్లపాడులో బుధవారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే 19న కందుకూరులో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డికి జరుగనున్న సన్మాన సభనూ విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు గొర్ల రామ్మోహన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.