సత్తుపల్లి, ఏప్రిల్ 13 : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, కల్లూరు ఇంఛార్జ్ ఆర్డీవో బి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు సమావేశాలు, ర్యాలీల అనుమతుల కోసం రెండు రోజుల ముందుగానే సువిధ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస సదుపాయాలపై తహసీల్దార్లతో చర్చించారు. అనంతరం గంగారం సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని సిబ్బందికి సూచించారు. తొలుత చెక్పోస్టులో రిజిస్టర్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కె.యోగేశ్వరరావు, ఎంఎ.రాజు, జి.ప్రతాప్, పి.సాంబశివుడు, బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.