భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు శనివారం కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నివాళి అర్పించారు. కొత్తగూడెంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కోరం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, సీఈవో విద్యాలత, నాగలక్ష్మి పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్/ లక్ష్మీదేవిపల్లి/ చుంచుపల్లి/ జూలూరుపాడు/ పాల్వంచ/ పాల్వంచ రూరల్, నవంబర్ 26 : మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి రవీందర్ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ ఎక్సేంజ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జే.మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు. చుంచుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బదావత్ శాంతి అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ పఠనం చేశారు.
రాజ్యాంగం తయారీ, ఆమోదం, అమలు తదితర అంశాలపై సంక్షిప్తంగా వివరించారు. జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రావు, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో సత్యనారాయణ, ఏపీవో రఘుపతి పాల్గొన్నారు. జూలూరుపాడు మండలంలోని చండ్రుగొండ క్రాస్రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్సై పోటు వినోద్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఇడుపుల రాజు, మోదుగు ప్రభాకర్, వేల్పుల నర్సింహారావు, శ్రీను పాల్గొన్నారు. పాల్వంచలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు, తెగల జాతుల హక్కుల పరిరక్షణ సంఘం, మాల మహానాడు ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా జరుపుకున్నారు. పాల్వంచలోని జాతీయ రహదారిలో, పాత పాల్వంచలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, ఎస్సైలు నరేశ్, ప్రవీణ్, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలో రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ ప్రమాణం చేశారు. జెన్కో డైరెక్టర్(సివిల్) అజయ్, సీఈ పి.వెంకటేశ్వరరావు, ఎస్ఈలు దుర్గ మల్లేశ్వరి, శ్రీనివాసరావు, యుగపతి, కిరణ్కుమార్ పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నప్పయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ అబ్రహాం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.