తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ది కీలకపాత్ర
ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కృషిచేస్తోంది
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో వక్తలు
ఖమ్మం/ కొత్తగూడెం/ మామిళ్లగూడెం, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం వేడుకలు జరిగాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయసాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఖమ్మం జడ్పీలో చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పద్మశాలీ సంఘం నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కొత్తగూడెం కలెక్టరేట్లో..
భద్రాద్రి కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ అనుదీప్ పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఖమ్మం కలెక్టరేట్లో..
ఖమ్మం కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నివాళులర్పించారు.పోలీసు కమిషనరేట్లో సీపీ విష్ణు ఎస్ వారియర్ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు.
టీఆర్ఎస్ కార్యాలయంలో..
తెలంగాణ భవన్లో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా పాల్గొని అనంతరం లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.