సత్తుపల్లి, డిసెంబర్ 27: సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.26.94 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సండ వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరు జీవోను సత్వరమే విడుదల చేసిన పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ను కూడాఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి గతంలో వచ్చిన మంత్రి కేటీఆర్ రూ.30 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇటీవల రూ.3.60 కోట్లు పనులు పూర్తిచేసుకోగా మిగిలిన 26.94 కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.