నియోజకవర్గం నుంచి 200 బస్సుల ఏర్పాటు
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
లక్ష్మీదేవిపల్లి/ చుంచుపల్లి, అక్టోబర్ 23 : వరంగల్లో వచ్చే నెల 15వ తేదీన జరిగే విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలు తరలిరావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లిలో టీఆర్ఎస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న కొత్తగూడెం క్లబ్లో జరగబోయే నియోజకవర్గస్థాయి సమావేశం, వచ్చే నెలలో జరిగే బహిరంగ సభ గురించి వివరించారు. మరో 20సంవత్సరాల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని అన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, మనం బాగుండాలంటే పార్టీని పటిష్టపర్చాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ భూక్యా సోనా, పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్పాషా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వజ్జా రాజు, ఎంపీటీసీలు కొల్లు పద్మ, తేజావత్ భద్రమ్మ, స్వామి, మూర్తి, కో-ఆప్షన్ సభ్యుడు జక్కుల సుందర్, సర్పంచులు కోరం చంద్రశేఖర్, తాటి పద్మ, పూనెం నాగేశ్వరరావు, పూనెం సంధ్య, కిషన్, బలరాం, లాలూ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చుంచుపల్లిలోని స్థానిక టీబీజీకేఎస్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన టీఆర్ఎస్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి కార్యకర్తలను తరలించేందుకు 200 బస్సులను ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ శాంతి, ఎంపీటీసీ కూసన వీరభద్రం, కో-ఆప్షన్ సభ్యుడు ఆరీఫ్ఖాన్, పార్టీ మండల అధ్యక్షుడు ఉమర్, మహేశ్వరరావు, శ్రీకాంత్, కనకరాజు, పరంజ్యోతిరావు, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు అనుదీప్, సర్పంచులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.