భద్రాచలం, జూలై 22: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఉదయం రామాలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకున్నారు. అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని భద్రుడి కోవెలను, లక్ష్మీతాయారు అమ్మవారిని, ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో శివాజీ.. వినోద్కుమార్ను శాలువాతో సత్కరించారు. రామయ్య ప్రసాదాలను, సీతారామలక్ష్మణుల జ్ఞాపికను అందజేశారు. తహసీల్దార్ శ్రీనివాస్యాదవ్, బోయినపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.